పెయిడ్ పార్కింగ్ లో వారికి మినహాయింపు లేదు..!
- March 30, 2023
యూఏఈ: ఎమిరేట్లో పెయిడ్ జోన్లలో పార్క్ చేసిన వాహనాల్లో లోపల ఉండటం వలన వారికి చెల్లించాల్సిన రుసుముల నుంచి మినహాయింపు లేదని వాహనదారులకు షార్జా మునిసిపాలిటీ గుర్తు చేసింది. యూఏఈలోని వాహనదారులు తమ వాహనాలను పెయిడ్ జోన్లలో పార్క్ చేయడం, చెల్లించకుండా లోపల వేచి ఉండటం చాలా సాధారణమైన విషయం. అయితే, గురువారం సోషల్ మీడియా పోస్ట్లో మునిసిపాలిటీ “వాహనంలో ఉండడం వల్ల పార్కింగ్ ఫీజు చెల్లించకుండా డ్రైవర్కు మినహాయింపు లేదు. డ్రైవర్లు పార్కింగ్ స్థలాన్ని వినియోగించినంత వరకు పార్కింగ్ రుసుము చెల్లించాలి. డ్రైవర్లు పార్కింగ్ మీటర్లు, SMS, డిజిటల్ షార్జా యాప్తో సహా అందుబాటులో ఉన్న ఏదైనా చెల్లింపు ఛానెల్ల ద్వారా పార్కింగ్ చేసిన 10 నిమిషాలలోపు రుసుము చెల్లించాలి.’’ అని తెలిపింది. అదేవిధంగా షార్జా మునిసిపాలిటీ వెబ్సైట్లోని పార్కింగ్ సంబంధిత నేరాల జాబితా ప్రకారం.. పార్కింగ్ కోసం చెల్లించడంలో విఫలం అయితే Dh150 జరిమానా.. నిర్ణీత సమయానికి మించి ఉంటే జరిమానా కింద 100 దిర్హామ్ లను చెల్లించాలి. ఇక వైకల్యాలున్న వాహనదారుల వంటి రిజర్వ్ చేయబడిన ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే 1,000 దిర్హామ్ జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







