ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్
- March 31, 2023
న్యూ ఢిల్లీ: దోమలు రాకుండా పెట్టిన మస్కిటో కాయిల్..ఏకంగా ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకుంది. శాస్త్రిపార్క్లోని ఓ ఇంట్లో దోమలు రాకుండా మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోయారు. అది ఉన్నట్టుండి పరుపుపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాప్తి చెందాయి. ఆ మంటలకు వాళ్లకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోలేక కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలొదిలారు. ఆ కాయిల్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే శ్వాస అందక చనిపోయారని వైద్యులు వెల్లడించారు.
'రాత్రి సమయంలో తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించారు. పరుపుపై మస్కిటో కాయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. మస్కిటో కాయిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. ఈ విషపూరిత పొగతో కుటుంబంలోని వారంతా స్పృహ కోల్పోయారు. తర్వాత వారు ఊపిరాడక మరణించారు' అని సీనియర్ ఆఫీసర్ జోయ్ టిర్కే చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!







