100 ఫోన్లను దొంగిలించడానికి ప్రయత్నించిన నలుగురు అరెస్ట్
- April 02, 2023
యూఏఈ: దుబాయ్లోని దీరాలో మొబైల్ ఫోన్ ట్రేడింగ్ కంపెనీ మేనేజర్, ఉద్యోగులపై దాడి చేసి 100 ఫోన్ల దొంగిలించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు రికార్డుల ప్రకారం.. వాడిన 50 ఫోన్లు ఇవ్వాలని, వ్యాపారం చేస్తామని నిందితుల్లో ఒకరు తనకు ఫోన్ చేసి అడిగారని మొబైల్ ఫోన్ ట్రేడింగ్ కంపెనీ మేనేజర్ తెలిపారు. నిందితులు, మరో ముగ్గురితో కలిసి కంపెనీ ప్రధాన కార్యాలయానికి వచ్చారని, ఫోన్ల సంఖ్యను 100కి పెంచాలని మేనేజర్ని కోరారు. అందుకు మేనేజర్ అంగీకరించి, 100,000 దిర్హామ్ల విలువైన ఫోన్లను సిద్ధం చేసి పెట్టెలో పెట్టమని తన సిబ్బందిని ఆదేశించాడు. అయితే, నిందితులు ఫోన్లకు డబ్బులు ఇవ్వకుండా బాక్స్ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. ఆ ముఠా కత్తులతో బెదిరించారు. కంపెనీ ఉద్యోగులు దొంగలను పట్టుకుని ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ముఠా ప్రధాన కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేశారు. అలాగే కంపెనీ మేనేజర్కు చెందిన చిన్న బ్యాగ్ను దొంగిలించారు. అందులో బ్యాంక్ కార్డులు, ఇతర కీలక పత్రాలు ఉన్నాయి. మేనేజర్ ఫిర్యాదుతో దుబాయ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సంగఘనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించింది. మేనేజర్ కార్డుతో చేసిన కొనుగోళ్లను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







