షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 35% వరకు తగ్గింపు
- April 02, 2023
యూఏఈ: వాహనదారులకు షార్జా బంపరాఫర్ ఇచ్చింది. వాహనదారులు జరిమానాలను ముందుగానే క్లియర్ చేస్తే ట్రాఫిక్ జరిమానాలపై 35 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం జరిగిన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. జరిమానా జారీ అయిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుంది. కాగా, ఈ తగ్గింపు జరిమానా మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. జప్తు రుసుము, ఏదైనా ఇతర జరిమానా ఉంటే పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. ట్రాఫిక్ నేరం చేసిన సంవత్సరం తర్వాత చెల్లించినట్లయితే జరిమానాలు లేదా రుసుములపై ఎలాంటి రాయితీలు వర్తించవని షార్జా తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









