షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 35% వరకు తగ్గింపు
- April 02, 2023
యూఏఈ: వాహనదారులకు షార్జా బంపరాఫర్ ఇచ్చింది. వాహనదారులు జరిమానాలను ముందుగానే క్లియర్ చేస్తే ట్రాఫిక్ జరిమానాలపై 35 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం జరిగిన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. జరిమానా జారీ అయిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుంది. కాగా, ఈ తగ్గింపు జరిమానా మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. జప్తు రుసుము, ఏదైనా ఇతర జరిమానా ఉంటే పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. ట్రాఫిక్ నేరం చేసిన సంవత్సరం తర్వాత చెల్లించినట్లయితే జరిమానాలు లేదా రుసుములపై ఎలాంటి రాయితీలు వర్తించవని షార్జా తెలిపింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







