ఉమ్రా యాత్రికులు నగదు, నగలు తేవద్దు: సౌదీ
- April 03, 2023
సౌదీ: ఉమ్రాకు వచ్చే యాత్రికులు పెద్ద మొత్తంలో నగదు, ఖరీదైన వస్తువులు, ఆభరణాలను తీసుకురావద్దని సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. యాత్రికులు ఆర్థిక మోసాలకు గురికాకుండా మంత్రిత్వ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు గరిష్ఠంగా $16,000 (SAR 60,000) నగదును మాత్రమే వెంట తీసుకురావాలని అధికార యంత్రాంగం సూచించింది. కరెన్సీని బదిలీ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి అధీకృత బ్యాంకులు, మనీ ఎక్స్ఛేంజ్ ప్రొవైడర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలో మూడు రకాలు మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్లు ఆమోదయోగ్యమైనవని పేర్కొంది. తమ రక్షణ హక్కుల కోసం ఆర్థిక లావాదేవీలు జరిపిన సమయంలో యాత్రికులు అన్ని రసీదులు, ఎలక్ట్రానిక్ లావాదేవీల రుజువులను తమ వద్ద పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







