ఉమ్రా యాత్రికులు నగదు, నగలు తేవద్దు: సౌదీ
- April 03, 2023
సౌదీ: ఉమ్రాకు వచ్చే యాత్రికులు పెద్ద మొత్తంలో నగదు, ఖరీదైన వస్తువులు, ఆభరణాలను తీసుకురావద్దని సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. యాత్రికులు ఆర్థిక మోసాలకు గురికాకుండా మంత్రిత్వ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు గరిష్ఠంగా $16,000 (SAR 60,000) నగదును మాత్రమే వెంట తీసుకురావాలని అధికార యంత్రాంగం సూచించింది. కరెన్సీని బదిలీ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి అధీకృత బ్యాంకులు, మనీ ఎక్స్ఛేంజ్ ప్రొవైడర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలో మూడు రకాలు మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్లు ఆమోదయోగ్యమైనవని పేర్కొంది. తమ రక్షణ హక్కుల కోసం ఆర్థిక లావాదేవీలు జరిపిన సమయంలో యాత్రికులు అన్ని రసీదులు, ఎలక్ట్రానిక్ లావాదేవీల రుజువులను తమ వద్ద పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









