ఖైదీల కుటుంబాల అద్దెలు, పిల్లల చదువుకు పోలీసుల ఆర్థిక సహాయం
- April 03, 2023
యూఏఈ: దుబాయ్లోని వందలాది మంది ఖైదీల టుంబాల అపార్ట్మెంట్ అద్దెలు, వారి పిల్లల చదువుల ఖర్చులు, వైద్య బిల్లులను దుబాయ్ పోలీసులకు చెల్లించారు. దుబాయ్ పోలీసు విభాగంలోని హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం ఖైదీలకు 1 మిలియన్ దిర్హామ్లకు పైగా ఆర్థిక, అంతర్గత సహాయం అందించినట్లు హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ కెప్టెన్ హబీబ్ అల్ జరౌనీ తెలిపారు. ఖైదీలకు, వారి కుటుంబాలకు సహాయం అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సహాయం జైళ్లలోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి కుటుంబాలకు సహాయం చేశాయని తెలిపారు. ఖైదీలను శిక్షించడం కాదని, వారికి పునరావాసం వైపు మార్గనిర్దేశం చేయడంతోపాటు వారు శిక్ష అనుభవించిన తర్వాత సమాజంలో జీవంచడానికి అవసరమైన నైపుణ్యాలు, శిక్షణతో వారిని సన్నద్ధం చేయడం తమ లక్ష్యమని డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మర్వాన్ అబ్దుల్ కరీమ్ జల్ఫర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









