ఖైదీల కుటుంబాల అద్దెలు, పిల్లల చదువుకు పోలీసుల ఆర్థిక సహాయం
- April 03, 2023
యూఏఈ: దుబాయ్లోని వందలాది మంది ఖైదీల టుంబాల అపార్ట్మెంట్ అద్దెలు, వారి పిల్లల చదువుల ఖర్చులు, వైద్య బిల్లులను దుబాయ్ పోలీసులకు చెల్లించారు. దుబాయ్ పోలీసు విభాగంలోని హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం ఖైదీలకు 1 మిలియన్ దిర్హామ్లకు పైగా ఆర్థిక, అంతర్గత సహాయం అందించినట్లు హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ కెప్టెన్ హబీబ్ అల్ జరౌనీ తెలిపారు. ఖైదీలకు, వారి కుటుంబాలకు సహాయం అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సహాయం జైళ్లలోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి కుటుంబాలకు సహాయం చేశాయని తెలిపారు. ఖైదీలను శిక్షించడం కాదని, వారికి పునరావాసం వైపు మార్గనిర్దేశం చేయడంతోపాటు వారు శిక్ష అనుభవించిన తర్వాత సమాజంలో జీవంచడానికి అవసరమైన నైపుణ్యాలు, శిక్షణతో వారిని సన్నద్ధం చేయడం తమ లక్ష్యమని డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మర్వాన్ అబ్దుల్ కరీమ్ జల్ఫర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









