సర్వమత ఇఫ్తార్లో పాల్గొన్న దౌత్యవేత్తలు, మతాధిపతులు
- April 03, 2023
యూఏఈ: అల్ మనార్ ఇస్లామిక్ సెంటర్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అనేక మంది మిషన్లు, మత పెద్దలు, ఇతర అతిథులు హాజరయ్యారు. హిందూ దేవాలయం, గురునానక్ దర్బార్ గురుద్వారా, చర్చిల నుండి మత పెద్దలు... యూకే, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, కొరియా, జపాన్, రష్యా, కెనడా కాన్సులర్ అధిపతులతో పాటు అనేక ఇతర మతాల అధిపతులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ మేఘన్ గ్రెగోనిస్, డిప్యూటీ కాన్సుల్తో కలిసి వచ్చి సర్వమత ఇఫ్తార్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ మత స్వేచ్ఛపై స్థాపించబడిందని, అమెరికాలో మొదటి దౌత్యవేత్త ఇఫ్తార్ విందు దాదాపు 200 సంవత్సరాల క్రితం వైట్ హౌస్లో జరిగిందని గ్రెగోనిస్ తెలిపారు. సర్వమత సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా పలువరు దౌత్యవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







