ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్
- April 04, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న నిర్వహించిన ఓపెన్ హౌస్ సక్సెస్ అయింది. బహ్రెయిన్ రాజ్యంలోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో దాదాపు 70 మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ శ్రీవాస్తవ ప్రతి ఒక్కరికీ పవిత్ర రమదాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి నెలలో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం 146వ IPU అసెంబ్లీకి హాజరయ్యారని, అలాగే రెండు మంత్రుల స్థాయి బృందాలు బహ్రెయిన్ లో పర్యటించారని గుర్తుచేశారు. భారత్, బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల సానుకూల పథం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగిస్తుందన్నారు. ఇదే క్రమంలో ఇటీవల దొంగా కన్నమ్మ, రాజన్ ముంగి లకు ICWF ద్వారా విమాన టిక్కెట్లు అందించడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని పేర్కొన్నారు. కాన్సులర్, కమ్యూనిటీ సంక్షేమ విషయాలకు సంబంధించి సత్వర మద్దతు, చర్య కోసం కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇమ్మిగ్రేషన్ అధికారులతో సహా బహ్రెయిన్ ప్రభుత్వ అధికారులకు రాయబారి శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







