అబుధాబి పోలీసుల చర్యకు నివాసితుల మద్దతు
- April 05, 2023
అబుధాబి: కీలకమైన వేగవంతమైన రహదారి లేన్లలో కనీస వేగాన్ని అమలు చేయడానికి అబుధాబి పోలీసుల చర్యకు అధిక సంఖ్యలో నివాసితులు మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫోర్స్ నిర్వహించిన పోల్ ప్రకారం.. 78 శాతం మంది ఈ చర్యకు అనుకూలంగా ఓటు వేశారని పోలీసులు తెలిపారు. ట్విట్టర్లో 81 శాతం మంది వినియోగదారులు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డులో 140కిలోమీటర్లు, రెండు ఎడమవైపు లేన్లపై కనిష్ఠంగా 120కిమీ వేగాన్ని అమలు చేస్తామని పోలీసులు గత నెలలో ప్రకటించారు. మే 1 నుండి రెండు లేన్లలో స్పీడ్ పరిమితి నిబంధన ఉల్లంఘించిన వారికి 400 దిర్హామ్ల జరిమానా విధించడం ప్రారంభించారు. రోడ్డు భద్రతను పెంపొందించడమే కనీస వేగ పరిమితి లక్ష్యంగా పోలీసులు ఈ సందర్భంగా వివరించారు. రహదారి గరిష్ఠ వేగ పరిమితి 140kmph కలిగి ఉన్నందున, ఫాస్ట్ లేన్లలో కనిష్ఠంగా 120kmph వేగాన్ని అమలు చేయడం వలన ఈ ట్రాక్లపై ఉన్న అన్ని వాహనాలు 20kmph మార్జిన్లో నడుస్తాయని తెలిపారు. ప్రమాదాలు జరిగితే వాటి తీవ్రతను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







