అబుధాబి పోలీసుల చర్యకు నివాసితుల మద్దతు
- April 05, 2023
అబుధాబి: కీలకమైన వేగవంతమైన రహదారి లేన్లలో కనీస వేగాన్ని అమలు చేయడానికి అబుధాబి పోలీసుల చర్యకు అధిక సంఖ్యలో నివాసితులు మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫోర్స్ నిర్వహించిన పోల్ ప్రకారం.. 78 శాతం మంది ఈ చర్యకు అనుకూలంగా ఓటు వేశారని పోలీసులు తెలిపారు. ట్విట్టర్లో 81 శాతం మంది వినియోగదారులు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డులో 140కిలోమీటర్లు, రెండు ఎడమవైపు లేన్లపై కనిష్ఠంగా 120కిమీ వేగాన్ని అమలు చేస్తామని పోలీసులు గత నెలలో ప్రకటించారు. మే 1 నుండి రెండు లేన్లలో స్పీడ్ పరిమితి నిబంధన ఉల్లంఘించిన వారికి 400 దిర్హామ్ల జరిమానా విధించడం ప్రారంభించారు. రోడ్డు భద్రతను పెంపొందించడమే కనీస వేగ పరిమితి లక్ష్యంగా పోలీసులు ఈ సందర్భంగా వివరించారు. రహదారి గరిష్ఠ వేగ పరిమితి 140kmph కలిగి ఉన్నందున, ఫాస్ట్ లేన్లలో కనిష్ఠంగా 120kmph వేగాన్ని అమలు చేయడం వలన ఈ ట్రాక్లపై ఉన్న అన్ని వాహనాలు 20kmph మార్జిన్లో నడుస్తాయని తెలిపారు. ప్రమాదాలు జరిగితే వాటి తీవ్రతను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







