అబుధాబి పోలీసుల చర్యకు నివాసితుల మద్దతు
- April 05, 2023
అబుధాబి: కీలకమైన వేగవంతమైన రహదారి లేన్లలో కనీస వేగాన్ని అమలు చేయడానికి అబుధాబి పోలీసుల చర్యకు అధిక సంఖ్యలో నివాసితులు మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫోర్స్ నిర్వహించిన పోల్ ప్రకారం.. 78 శాతం మంది ఈ చర్యకు అనుకూలంగా ఓటు వేశారని పోలీసులు తెలిపారు. ట్విట్టర్లో 81 శాతం మంది వినియోగదారులు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డులో 140కిలోమీటర్లు, రెండు ఎడమవైపు లేన్లపై కనిష్ఠంగా 120కిమీ వేగాన్ని అమలు చేస్తామని పోలీసులు గత నెలలో ప్రకటించారు. మే 1 నుండి రెండు లేన్లలో స్పీడ్ పరిమితి నిబంధన ఉల్లంఘించిన వారికి 400 దిర్హామ్ల జరిమానా విధించడం ప్రారంభించారు. రోడ్డు భద్రతను పెంపొందించడమే కనీస వేగ పరిమితి లక్ష్యంగా పోలీసులు ఈ సందర్భంగా వివరించారు. రహదారి గరిష్ఠ వేగ పరిమితి 140kmph కలిగి ఉన్నందున, ఫాస్ట్ లేన్లలో కనిష్ఠంగా 120kmph వేగాన్ని అమలు చేయడం వలన ఈ ట్రాక్లపై ఉన్న అన్ని వాహనాలు 20kmph మార్జిన్లో నడుస్తాయని తెలిపారు. ప్రమాదాలు జరిగితే వాటి తీవ్రతను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







