అబుధాబి పోలీసుల చర్యకు నివాసితుల మద్దతు
- April 05, 2023
అబుధాబి: కీలకమైన వేగవంతమైన రహదారి లేన్లలో కనీస వేగాన్ని అమలు చేయడానికి అబుధాబి పోలీసుల చర్యకు అధిక సంఖ్యలో నివాసితులు మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫోర్స్ నిర్వహించిన పోల్ ప్రకారం.. 78 శాతం మంది ఈ చర్యకు అనుకూలంగా ఓటు వేశారని పోలీసులు తెలిపారు. ట్విట్టర్లో 81 శాతం మంది వినియోగదారులు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డులో 140కిలోమీటర్లు, రెండు ఎడమవైపు లేన్లపై కనిష్ఠంగా 120కిమీ వేగాన్ని అమలు చేస్తామని పోలీసులు గత నెలలో ప్రకటించారు. మే 1 నుండి రెండు లేన్లలో స్పీడ్ పరిమితి నిబంధన ఉల్లంఘించిన వారికి 400 దిర్హామ్ల జరిమానా విధించడం ప్రారంభించారు. రోడ్డు భద్రతను పెంపొందించడమే కనీస వేగ పరిమితి లక్ష్యంగా పోలీసులు ఈ సందర్భంగా వివరించారు. రహదారి గరిష్ఠ వేగ పరిమితి 140kmph కలిగి ఉన్నందున, ఫాస్ట్ లేన్లలో కనిష్ఠంగా 120kmph వేగాన్ని అమలు చేయడం వలన ఈ ట్రాక్లపై ఉన్న అన్ని వాహనాలు 20kmph మార్జిన్లో నడుస్తాయని తెలిపారు. ప్రమాదాలు జరిగితే వాటి తీవ్రతను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









