ఎన్టీయార్తో ఢీ అంటే ఢీ అనబోతున్న సైఫ్ అలీఖాన్.!
- April 18, 2023ఎన్టీయార్ 30ని ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే బాలీవుడ్ గ్లామర్ ఈ సినిమాలో ఎక్కువగా వుండేలా చూసుకుంటున్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇప్పటికే ఎన్టీయార్ పక్కన హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రతినాయకుడి పాత్రను రివీల్ చేశారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత నెల షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా శరవేగంగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే దిశగా పరుగులు పెడుతోంది.
అందులో భాగంగానే, విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం సెట్స్లోకి అడుగు పెట్టినట్లు యూనిట్ ప్రకటించింది. విలన్గా చాలా పవర్ ఫుల్గా సైఫ్ పాత్రను తీర్చిదిద్దారట కొరటాల శివ.
అన్నట్లు ఎన్టీయార్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..