కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుని చంపేస్తామని బెదిరింపు లేఖ..!
- May 09, 2016
తమిళనాడులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి షాకింగ్ తగిలింది. మే 16న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాహుల్ పుదుచ్చేరిలో ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే రాహుల్ గాంధీని చంపేస్తామని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అహమ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని వినతి పత్రం సమర్పించారు. బెదిరింపు ఉత్తరాలు పంపిన ఘటనపై విచారణ చేపట్టాలని మనవి చేశారు. 1991లో రాహుల్ తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్యకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని అంతం చేస్తామని బెదిరింపు లేఖలు రావడంతో కాంగ్రెస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పుదేచ్చేరి పార్టీ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు. బెదిరింపు లేఖలు తమిళంలో రాశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







