కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుని చంపేస్తామని బెదిరింపు లేఖ..!
- May 09, 2016
తమిళనాడులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి షాకింగ్ తగిలింది. మే 16న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాహుల్ పుదుచ్చేరిలో ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే రాహుల్ గాంధీని చంపేస్తామని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అహమ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని వినతి పత్రం సమర్పించారు. బెదిరింపు ఉత్తరాలు పంపిన ఘటనపై విచారణ చేపట్టాలని మనవి చేశారు. 1991లో రాహుల్ తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్యకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని అంతం చేస్తామని బెదిరింపు లేఖలు రావడంతో కాంగ్రెస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పుదేచ్చేరి పార్టీ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు. బెదిరింపు లేఖలు తమిళంలో రాశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







