ఖతార్‌ జనాభాలో 97 శాతం మంది సోషల్ మీడియా వినియోగదారులే..!

- April 26, 2023 , by Maagulf
ఖతార్‌ జనాభాలో 97 శాతం మంది సోషల్ మీడియా వినియోగదారులే..!

దోహా: ఖతార్‌లో 2.62 మిలియన్ల మంది..మొత్తం జనాభాలో 96.8% యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ రిఫరెన్స్ లైబ్రరీ డేటా రిపోర్టల్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..  జనవరి 2023లో ఖతార్‌లో 2.68 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.  ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంటర్నెట్ వ్యాప్తి రేటు 99 శాతంగా ఉంది. 2023 ప్రారంభంలో ఆఫ్‌లైన్‌లో ఉన్న 1% మంది.. మొత్తం జనాభాలో 27.1 వేల మంది ఉన్నారు. జనవరి 2023లో దేశంలోని మొత్తం ఇంటర్నెట్ యూజర్ బేస్‌లో 97.8 శాతం మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించారని డేటా రిపోర్టల్ పేర్కొంది.

ఖతార్‌లో నివసించే ప్రజలు ఎక్కువగా సందర్శించే ఆన్‌లైన్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో యూట్యూబ్ (2.62 మిలియన్ల వినియోగదారులు) తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత టిక్‌టాక్ (2.14 మిలియన్ల వినియోగదారులు), ఫేస్‌బుక్ (1.95 మిలియన్లు), ఇన్‌స్టాగ్రామ్ (1.40 మిలియన్లు), లింక్డ్‌ఇన్ (1.20 మిలియన్లు), ట్విట్టర్ (1.05 మిలియన్లు), మరియు స్నాప్‌చాట్ (975,000) ఉన్నాయి.

మరోవైపు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనల రీచ్ ఖతార్‌లో వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వినియోగదారుల సంఖ్యలో పెరుగుదల స్వల్పంగా తగ్గగా..   లింక్డ్‌ఇన్, ట్విట్టర్, టిక్‌టాక్ లలో పెరుగుదల నమోదైంది. 2023 ప్రారంభంలో ఖతార్‌లో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దవారిలో 96.5% మందికి షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ ప్రకటనలు చేరుకున్నాయని టిక్‌టాక్‌ను నిర్వహిస్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ బైట్‌డాన్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి పన్నెండు నెలల్లో ఖతార్‌లో ఇంటర్నెట్ వేగం కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. మీడియా మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం 78.08 Mbps పెరుగుదల (79.6% పైగా) నమోదైంది. అదే సమయంలో ఖతార్‌లో స్థిర ఇంటర్నెట్ కనెక్షన్ వేగం కూడా 26.70 Mbps (41.6% పైగా) పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం పెరుగుతోందని నివేదిక వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com