యూఏఈ లో ఢీకొన్న ట్రక్కులు.. ప్రవాస డ్రైవర్ మృతి

- May 02, 2023 , by Maagulf
యూఏఈ లో ఢీకొన్న ట్రక్కులు.. ప్రవాస డ్రైవర్ మృతి

యూఏఈ: రస్ అల్ ఖైమాలో సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. అరబిక్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయని ఎమిరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అథారిటీకి ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. మంటలను ఆర్పివేసి.. మంటల్లో కాలిపోయిన ఆసియన్ ప్రవాసి అయిన డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com