తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు..
- May 02, 2023
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కళామందిర్ షాపులు, డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్ లోనే 40 చోట్ల ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకు అధికారులు చేరుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖ షాపుల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..









