యువకుడి మరణానికి కారణమైన డ్రైవర్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- May 17, 2023
బహ్రెయిన్ : యువకుడి మరణానికి కారణమైన బహ్రెయిన్ డ్రైవర్ను లోయర్ క్రిమినల్ కోర్ట్ హత్య ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అర్థరాత్రి ఫుట్బాల్ ఆడుతున్న యువకుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతోనే యాక్సిడెంట్ అయిందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు వాహనాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడని కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అనంతరం యువకుడి మరణానికి కారణమయ్యాడని వాహన డ్రైవర్ పై అభియోగాలు మోపారు. అయితే, యువకుడు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, అక్కడంతా చీకటిగా ఉన్నదని, పైగా మరణించిన యువకుడు నల్ల టీ-షర్టు ధరించాడని.. ఇందులో ప్రతివాది తప్పు లేదని అతని లాయర్ నిరూపించగలిగాడు. మృత్యువాత పడిన యువకుడు తనకు తెలియకుండానే ఏదైనా వాహనం వస్తున్నాయో లేదో చూసుకోకుండా రోడ్డుపైకి వచ్చాడని కూడా ఈ ఘటన టెక్నికల్ రిపోర్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు