యువకుడి మరణానికి కారణమైన డ్రైవర్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- May 17, 2023
బహ్రెయిన్ : యువకుడి మరణానికి కారణమైన బహ్రెయిన్ డ్రైవర్ను లోయర్ క్రిమినల్ కోర్ట్ హత్య ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అర్థరాత్రి ఫుట్బాల్ ఆడుతున్న యువకుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతోనే యాక్సిడెంట్ అయిందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు వాహనాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడని కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అనంతరం యువకుడి మరణానికి కారణమయ్యాడని వాహన డ్రైవర్ పై అభియోగాలు మోపారు. అయితే, యువకుడు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, అక్కడంతా చీకటిగా ఉన్నదని, పైగా మరణించిన యువకుడు నల్ల టీ-షర్టు ధరించాడని.. ఇందులో ప్రతివాది తప్పు లేదని అతని లాయర్ నిరూపించగలిగాడు. మృత్యువాత పడిన యువకుడు తనకు తెలియకుండానే ఏదైనా వాహనం వస్తున్నాయో లేదో చూసుకోకుండా రోడ్డుపైకి వచ్చాడని కూడా ఈ ఘటన టెక్నికల్ రిపోర్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









