యువకుడి మరణానికి కారణమైన డ్రైవర్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- May 17, 2023
బహ్రెయిన్ : యువకుడి మరణానికి కారణమైన బహ్రెయిన్ డ్రైవర్ను లోయర్ క్రిమినల్ కోర్ట్ హత్య ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అర్థరాత్రి ఫుట్బాల్ ఆడుతున్న యువకుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతోనే యాక్సిడెంట్ అయిందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు వాహనాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడని కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అనంతరం యువకుడి మరణానికి కారణమయ్యాడని వాహన డ్రైవర్ పై అభియోగాలు మోపారు. అయితే, యువకుడు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, అక్కడంతా చీకటిగా ఉన్నదని, పైగా మరణించిన యువకుడు నల్ల టీ-షర్టు ధరించాడని.. ఇందులో ప్రతివాది తప్పు లేదని అతని లాయర్ నిరూపించగలిగాడు. మృత్యువాత పడిన యువకుడు తనకు తెలియకుండానే ఏదైనా వాహనం వస్తున్నాయో లేదో చూసుకోకుండా రోడ్డుపైకి వచ్చాడని కూడా ఈ ఘటన టెక్నికల్ రిపోర్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







