యువకుడి మరణానికి కారణమైన డ్రైవర్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- May 17, 2023
బహ్రెయిన్ : యువకుడి మరణానికి కారణమైన బహ్రెయిన్ డ్రైవర్ను లోయర్ క్రిమినల్ కోర్ట్ హత్య ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అర్థరాత్రి ఫుట్బాల్ ఆడుతున్న యువకుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతోనే యాక్సిడెంట్ అయిందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు వాహనాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడని కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అనంతరం యువకుడి మరణానికి కారణమయ్యాడని వాహన డ్రైవర్ పై అభియోగాలు మోపారు. అయితే, యువకుడు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, అక్కడంతా చీకటిగా ఉన్నదని, పైగా మరణించిన యువకుడు నల్ల టీ-షర్టు ధరించాడని.. ఇందులో ప్రతివాది తప్పు లేదని అతని లాయర్ నిరూపించగలిగాడు. మృత్యువాత పడిన యువకుడు తనకు తెలియకుండానే ఏదైనా వాహనం వస్తున్నాయో లేదో చూసుకోకుండా రోడ్డుపైకి వచ్చాడని కూడా ఈ ఘటన టెక్నికల్ రిపోర్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







