జగన్ సర్కార్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
- May 17, 2023
సుప్రీంకోర్టు లో జగన్ సర్కార్కు షాక్ తగిలింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి రిజర్వాయర్కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ కొట్టి వేసింది. దీంతో ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాలో ముందుగా రూ.25 కోట్లను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. జస్జిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.100 కోట్ల జరిమానా విధించవచ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ న్యాయస్థానం అక్టోబర్కు వాయిదా వేసింది.
ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్ధమని సుప్రీం ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. రూ.100 కోట్ల జరిమానా భారం అవుతుందని రోహత్గీ వాదించారు. రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







