సౌదీ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ యూనిట్లు
- May 26, 2023![1 సౌదీ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ యూనిట్లు](https://www.maagulf.com/godata/articles/202305/sad_1685075115.jpg)
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రధాన కార్యాలయంలో పర్యాటకం కోసం కొత్త ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్-ముజాబ్.. రాజ్యంలో అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త ప్రాసిక్యూషన్ వ్యవస్థ, విజయవంతమైన న్యాయం సూత్రాలకు అనుగుణంగా.. పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా, పర్యాటకులు, సందర్శకుల కేసుల ప్రక్రియలను తక్కువ సమయంలో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ప్రాసిక్యూషన్ నేరుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అనుసంధానించబడి, అన్ని చట్టపరమైన విధానాలు, చర్యలను తీసుకుంటుంది. సిస్టమ్కు అనుగుణంగా కేసులను పరిష్కరిస్తుంది. పర్యాటకులు వారికి కేటాయించిన వారి హక్కులు, హామీలను ఆస్వాదించేలా 24 గంటలూ పని చేస్తుంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అర్హత కలిగిన సభ్యుల కేడర్, శిక్షణ పొందిన అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న సహాయకులు అత్యున్నత స్థాయి చట్టపరమైన సామర్థ్యం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు అనుగుణంగా కొత్త యూనిట్లలో పని చేస్తారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము