సౌదీ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ యూనిట్లు
- May 26, 2023
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రధాన కార్యాలయంలో పర్యాటకం కోసం కొత్త ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్-ముజాబ్.. రాజ్యంలో అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త ప్రాసిక్యూషన్ వ్యవస్థ, విజయవంతమైన న్యాయం సూత్రాలకు అనుగుణంగా.. పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా, పర్యాటకులు, సందర్శకుల కేసుల ప్రక్రియలను తక్కువ సమయంలో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ప్రాసిక్యూషన్ నేరుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అనుసంధానించబడి, అన్ని చట్టపరమైన విధానాలు, చర్యలను తీసుకుంటుంది. సిస్టమ్కు అనుగుణంగా కేసులను పరిష్కరిస్తుంది. పర్యాటకులు వారికి కేటాయించిన వారి హక్కులు, హామీలను ఆస్వాదించేలా 24 గంటలూ పని చేస్తుంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అర్హత కలిగిన సభ్యుల కేడర్, శిక్షణ పొందిన అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న సహాయకులు అత్యున్నత స్థాయి చట్టపరమైన సామర్థ్యం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు అనుగుణంగా కొత్త యూనిట్లలో పని చేస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









