సౌదీ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ యూనిట్లు
- May 26, 2023
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రధాన కార్యాలయంలో పర్యాటకం కోసం కొత్త ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్-ముజాబ్.. రాజ్యంలో అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త ప్రాసిక్యూషన్ వ్యవస్థ, విజయవంతమైన న్యాయం సూత్రాలకు అనుగుణంగా.. పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా, పర్యాటకులు, సందర్శకుల కేసుల ప్రక్రియలను తక్కువ సమయంలో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ప్రాసిక్యూషన్ నేరుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అనుసంధానించబడి, అన్ని చట్టపరమైన విధానాలు, చర్యలను తీసుకుంటుంది. సిస్టమ్కు అనుగుణంగా కేసులను పరిష్కరిస్తుంది. పర్యాటకులు వారికి కేటాయించిన వారి హక్కులు, హామీలను ఆస్వాదించేలా 24 గంటలూ పని చేస్తుంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అర్హత కలిగిన సభ్యుల కేడర్, శిక్షణ పొందిన అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న సహాయకులు అత్యున్నత స్థాయి చట్టపరమైన సామర్థ్యం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు అనుగుణంగా కొత్త యూనిట్లలో పని చేస్తారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







