సౌదీ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ యూనిట్లు
- May 26, 2023
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రధాన కార్యాలయంలో పర్యాటకం కోసం కొత్త ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్-ముజాబ్.. రాజ్యంలో అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త ప్రాసిక్యూషన్ వ్యవస్థ, విజయవంతమైన న్యాయం సూత్రాలకు అనుగుణంగా.. పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా, పర్యాటకులు, సందర్శకుల కేసుల ప్రక్రియలను తక్కువ సమయంలో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ప్రాసిక్యూషన్ నేరుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అనుసంధానించబడి, అన్ని చట్టపరమైన విధానాలు, చర్యలను తీసుకుంటుంది. సిస్టమ్కు అనుగుణంగా కేసులను పరిష్కరిస్తుంది. పర్యాటకులు వారికి కేటాయించిన వారి హక్కులు, హామీలను ఆస్వాదించేలా 24 గంటలూ పని చేస్తుంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అర్హత కలిగిన సభ్యుల కేడర్, శిక్షణ పొందిన అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న సహాయకులు అత్యున్నత స్థాయి చట్టపరమైన సామర్థ్యం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు అనుగుణంగా కొత్త యూనిట్లలో పని చేస్తారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం