హజ్ కోసం 22,000 మంది నియామకం
- May 29, 2023రియాద్: యాత్రికులకు సేవలు అందించేందుకు వీలుగా 22,000 మంది కార్మికులను రిక్రూట్ చేయడంతో సహా హజ్ కోసం సన్నాహాలు పూర్తి చేసినట్లు మక్కా మున్సిపాలిటీ వెల్లడించింది. మునిసిపాలిటీ తన అన్ని మానవ, యాంత్రిక సామర్థ్యాలను సమీకరించిందని, ప్రజా భద్రత మరియు స్కౌట్స్, తాత్కాలిక ఆరోగ్య మానిటర్లు, అలాగే పెద్ద సంఖ్యలో పరికరాలు, యంత్రాలతో సహా సహాయక బృందాల మద్దతుతో మునిసిపల్ సేవలను అత్యున్నత స్థాయిలో యాత్రికులకు సేవలు అందించడానికి మునిసిపాలిటీ సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి ఒసామా జైతునీ తెలిపారు. మున్సిపాలిటీ తన 13 సబ్-మునిసిపాలిటీలు, మూడు అనుబంధ మునిసిపాలిటీలు, అలాగే మక్కాలోని 28 కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని తరలించి విధులు కేటాయించినట్లు జైతునీ తెలిపారు.
కాగా, నైజీరియా నుంచి వచ్చిన హజ్ యాత్రికుల తొలి బృందాన్ని శనివారం జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు స్వాగతం పలికింది. ఇరాన్ నుండి హజ్ యాత్రికులతో మరో విమానం మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయాలు, భూ సరిహద్దులు, ఓడరేవుల వద్ద హజ్ సమయంలో యాత్రికుల కోసం విధివిధానాలను సమర్థవంతంగా నిర్వహించడానికి డైరెక్టరేట్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?