ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
- June 04, 2023న్యూ ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. హస్తినలోని అమిత్ షా నివాసంలో 50 నిముషాల పాటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కొనసాగింది. ఏపీ, తెలంగాణ సహా జాతీయ రాజకీయ అంశాలు, పొత్తులపై జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. పొత్తులు, ఎన్డీఏలో భాగస్వామ్యంపై ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం.
భవిష్యత్ లో మరిన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది. టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
కాగా, ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్.. ఏపీలో పోటీ చేస్తుంది కాబట్టి కలిసి వెళ్తే రెండు రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, విపక్షాల ఐక్యత కసరత్తు నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..