ఢిల్లీ లో 'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమం
- May 12, 2016
'నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. నర్సు వృత్తిలో విశేషమైన సేవలు అందించి ఎంతో మందికి సహాయం చేసినందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ అవార్డులను అందజేస్తుంది.
ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ సందర్భంగా రోగులకు విశేష సేవలు అందించిన పలువురు నర్సులను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









