ప్రభుత్వం అమరావతి వాసులకు ఉచిత వైద్యం
- May 12, 2016
రాష్ట్రం విడిపోయే నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరికీ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్లందరికి తెల్ల, పింక్ రేషన్ రేషన్ కార్డు అన్న తారతమ్యం లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వైద్య సదుపాయం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ స్కీములో ఉన్న మార్గదర్శకాలన్నీ వీళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నిర్వహిస్తుందని, నిర్వహణకు ప్రత్యేకంగా సిటీ మేనేజర్ను నియమిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వైద్య సదుపాయానికి అయ్యే ఖర్చు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఎన్టీఆర్ ట్రస్ట్కు చెల్లిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







