పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

- June 09, 2023 , by Maagulf
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ: మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బిఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్‌ మండలం గుడి పేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ. 500 కోట్ల వ్యయంతో ఫామ్‌ ఆయిల్‌ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల నూతన కలెక్టరేట్‌ భవనంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ''పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి.. నలుగురి ఆఫీసర్లను పెంచడం కాదు. సంస్కరణ అనేది ఒకరోజుతో అంతం అయ్యేది కూడా కాదు. ఇది నిరంతరం ప్రక్రియ'' అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడేనాటికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్‌ స్థానంలో ఉందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తామని అన్నారు. పామాయిల్‌కు దేశంలో గిరాకీ ఏర్పడుతోందన్న కేసీఆర్‌.. ఆ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com