ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది
- May 12, 2016
తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. 40 శాతం వరకు ఉద్యోగుల వేతనాలను పెంచినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నారు. బాధ్యతతో పనిచేసి మంచి పేరు తేవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు లక్ష్మారెడ్డి చెప్పారు.పీహెచ్ సీ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.6వేల నుంచి రూ.12 వేలకు, నెట్ వర్క్ ఆరోగ్య మిత్ర వేతనాలను రూ.7 వేల నుంచి రూ.12వేలకు పెంచింది. వీరితో పాటు ఆరోగ్యశ్రీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









