హైదరాబాద్లో ఈ సమావేశాలు జరుగుతాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 12, 2023
హైదరాబాద్: భారత దేశంలో జీ 20 సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అనేక అంశాలపై చర్చలకు భారత్ వేదికైందని తెలిపారు. 46 రంగాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 75 శాతం గ్లోబల్ ట్రేడ్ జీ20 దేశాల నుంచి జరుగుతోందని తెలిపారు.
హైదరాబాద్ హైటెక్ సిటీ వేదికగా ఈ నెల 15 నుంచి 17వరకు జరిగే సమావేశాలకు జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్ లో జీ20లో భాగంగా నిర్వహించే వ్యవసాయ సమావేశాల్లో ఇక్రిశాట్ కూడా పాల్గొంటుందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయన్నారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు. టూరిజం చివరి సమావేశాలు జూన్ 19, 20, 21, 22 తేదీల్లో గోవాలో జరుగుతాయని తెలిపారు.
గోవా రోడ్ మ్యాప్ పేరుతో డ్రాఫ్ట్ ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాంస్కృతిక శాఖ తుది సమావేశాలు వారణాసిలో జరుగుతాయని వివరించారు.
తాజా వార్తలు
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!







