ఒమన్ విమానాశ్రయాలను ఉపయోగించిన 3 మిలియన్ల మంది ప్రయాణికులు
- June 13, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాలను వినియోగించుకుంటున్న ప్రయాణీకుల సంఖ్య 2023 మార్చి చివరి నాటికి 3 మిలియన్లకు పైగా పెరిగింది. నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన ప్రాథమిక గణాంకాల నివేదిక ప్రకారం.. మార్చి 2023 చివరి వరకు ఒమన్ సుల్తానేట్ మానాశ్రయాల ద్వారా ప్రయాణీకుల సంఖ్య 88 శాతం పెరిగింది. 3,287,015 మంది ప్రయాణికులు నమోదయ్యారు. 2022లో ఇదే కాలంలో 1,746,259 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్చి 2023 చివరి నాటికి మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య 2,959,829 మందికి చేరుకుంది. మార్చి 2022 చివరి వరకు 1,473,818 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది 100.8 శాతం పెరిగింది. విమానాశ్రయం ద్వారా విమానాల సంఖ్య కూడా 93.9 శాతం పెరిగి 22,145 విమానాలకు చేరుకుంది. మార్చి 2022 చివరి నాటికి వీటి సంఖ్య 11,419 విమానాలుగా ఉంది. సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 34.2 శాతం పెరిగి 2,184 విమానాలలో 304,538 మంది ప్రయాణికులకు చేరుకుంది. 2022లో ఇదే కాలంతో పోలిస్తే విమానాల సంఖ్య 33.2 శాతం పెరిగింది. సోహార్ విమానాశ్రయం ద్వారా అదే సమయంలో 76 విమానాల్లో 5,401 మంది ప్రయాణికులు చేరుకోగా, దుక్మ్ విమానాశ్రయం ద్వారా 152 విమానాల్లో 17,247 మంది ప్రయాణించారని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







