7,300 మందికి నిరుద్యోగ బీమా ప్రయోజనాలు నిలిపివేత
- June 15, 2023
రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) బుధవారం నాడు 7,300 మందికి పైగా లబ్ధిదారులకు నిరుద్యోగ బీమా ప్రయోజనాల పంపిణీని నిలిపివేసినట్లు ప్రకటించింది. వారు ఉద్యోగాల కోసం సీరియస్గా లేరని రుజువైనందున, మానవ వనరుల అభివృద్ధి నిధి (హాడాఫ్) వారికి అందించే ఉద్యోగ అవకాశాలను తిరస్కరించడంతో గత నెల వాయిదాల సామాజిక బీమా పెన్షన్ పంపిణీని తిరస్కరించారు. పెన్షన్ చెల్లింపులు నిలిపివేయబడిన వారి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సామాజిక బీమా చట్టంలోని ఆర్టికల్ 17లోని ఐదవ పేరాలో పని చేయగల లబ్ధిదారుడు పని కోసం వెతకడం లేదని, లేదా ఉపాధి ప్లాట్ఫారమ్లకు దరఖాస్తు చేసుకోలేదని మంత్రిత్వ శాఖకు రుజువైతే పెన్షన్ నిలిపివేయబడుతుందని నిర్దేశిస్తున్నట్లు పేర్కొంది. పని చేయగలిగిన లబ్ధిదారులందరూ సంబంధిత అధికారులు వారికి అందించిన శిక్షణ, అర్హతలు, ఉపాధి అవకాశాలకు ప్రతిస్పందించాలని.. సామాజిక బీమా పెన్షన్ పంపిణీని నిలిపివేయకుండా ఉండటానికి ఆమోదించబడిన ఉపాధి ప్లాట్ఫారమ్ల ద్వారా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







