మొబైల్ యాప్ ద్వారా మల్టీ బ్యాంక్ ఖాతాల నుండి చెల్లింపులు..!
- June 15, 2023
యూఏఈ: ప్రవాసులు త్వరలో ఇంటర్నల్ పేమెంట్ ప్లాట్ఫారమ్ను ప్రవేశపెట్టడంతో మల్టీ బ్యాంక్ ఖాతాల నుండి మొబైల్ యాప్ల ద్వారా డబ్బును పంపే సౌలభ్యాన్ని పొందుతారు. మనీ ఎక్స్ఛేంజ్ , రెమిటెన్స్ వ్యాపారంలో ఉన్న ఫారిన్ ఎక్స్ఛేంజ్, రెమిటెన్స్ గ్రూప్ (ఫెర్గ్) వైస్-ఛైర్మన్ అదీబ్ అహమ్మద్ మాట్లాడుతూ.. ఎక్స్ఛేంజ్ హౌస్లు అంతర్గత చెల్లింపు వ్యవస్థ కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. తక్షణ చెల్లింపు ప్లాట్ఫారమ్ (IPP), ఒకే యాప్ ద్వారా బహుళ బ్యాంకుల ఖాతాల నుండి తక్షణ నిధుల బదిలీని ప్రారంభిస్తుందని తెలిపారు. టెక్నో మీట్ 23 సందర్భంగా ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. అంతర్గత చెల్లింపులు ప్రస్తుతం అమలులో లేవని, ఎక్స్ఛేంజ్ హౌస్లు బహుళ బ్యాంక్ ఖాతాలు లేదా వాలెట్ల నుండి కస్టమర్ నుండి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుందని వివరించారు.
యూఏఈలో ఎక్కువ మంది ప్రవాసులు నివసిస్తున్నందున, ప్రవాస కార్మికులు వారి కుటుంబాలకు ప్రధానంగా ఆసియా, మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికాకు ప్రతినెలా బిలియన్ల దిర్హామ్లు పంపుతారు. ప్రస్తుతం, మొత్తం రెమిటెన్స్లలో దాదాపు 11 శాతం డిజిటల్ మార్గాల ద్వారా జరుగుతున్నాయని షరాఫ్ ఎక్స్ఛేంజ్ సీఈఓ ఇమాద్ ఉల్ మాలిక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







