సౌదీ చేరుకున్న వ్యోమగాములు రయ్యానా బర్నావి, అలీ అల్కర్నీ
- June 17, 2023
రియాద్: సౌదీ వ్యోమగాములు అలీ అల్కర్నీ, రయ్యానా బర్నావి, మరియం ఫర్దౌస్, అలీ అల్-గమ్ది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతమైన శాస్త్రీయ మిషన్ తర్వాత శనివారం ఉదయం రాజ్యానికి తిరిగి వచ్చారు. అల్కర్నీ, బర్నావి - భూమిని కక్ష్యలోకి వెళ్లిన మొదటి అరబ్ మహిళగా రికార్డులు సృష్టించారు. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది రోజుల బస తర్వాత మే 31న భూమికి తిరిగి వచ్చారు. అక్కడ వారు మైక్రోగ్రావిటీపై 14 పరిశోధన ప్రాజెక్టులు చేశారు. వాటిలో మూడు ప్రాజెక్టులను సౌదీలోని 47 ప్రాంతాల నుండి 12,000 మంది పాఠశాల విద్యార్థులతో చేపట్టారు. ‘‘శాస్త్రీయ మిషన్ మానవాళికి గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుంది. అంతరిక్ష పరిశోధనలో కింగ్డమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.’’ అని కింగ్ ఖలేద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యోమగాములు రాక సందర్భంగా సౌదీ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మద్దతుతో సౌదీ అంతరిక్ష యాత్ర ప్రముఖ విజయాలను నమోదు చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!