సిటీ సెంటర్లో ఆకట్టుకున్న మిల్లెట్ ఫెస్టివల్
- June 18, 2023
కువైట్: కువైట్లోని ప్రముఖ హైపర్మార్కెట్ చైన్ సిటీ సెంటర్ వారి సాల్మియా షోరూమ్లో మిల్లెట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. మిల్లెట్ ఫెస్టివల్ను కువైట్లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంటర్ సీఓఓ శ్రీ అజయ్ గోయెల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మిల్లెట్ ఫెస్టివల్ నెలరోజుల ప్రచారంలో భాగంగా మిల్లెట్ యొక్క పోషక, ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతోపాటు, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దేశంలోని పలు సిటీ సెంటర్ స్టోర్లలో భారతదేశంలోని వివిధ రకాల మిల్లెట్లు అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్ ఫెస్ట్లో భాగంగా వివిధ రకాల రుచికరమైన మిల్లెట్ వంటకాలను చెఫ్ ఛాయా ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, మార్చి 2021లో దాని 75వ సెషన్లో 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (IYM2023)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







