రియాల్టీ కాంట్రాక్ట్ వివాదం.. కస్టమర్కు BD5000 రీఫండ్
- June 18, 2023
బహ్రెయిన్: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లోయర్ సివిల్ కోర్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మొట్టికాయలు వేసింది. కస్టమర్ కు BD5,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, కస్టమర్ కొనుగోలు ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయడంలో విఫలమైతే వాపసు పొందేందుకు అర్హత ఉండదు. అయితే, ఫిర్యాది ఒకే చెక్కులో పూర్తి చెల్లింపు చేసినందున, వారు రిఫండ్ పొందేందుకు అర్హులని కోర్టు నిర్ధారించింది. ఫిర్యాదుదారు రెండు నెలల వ్యవధిలో విల్లాను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కేసు దాఖలైంది. వ్యక్తి మజాయా ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే చెక్కు ద్వారా సింగిల్ పేమెంట్ చేసినా రిఫండ్ కోసం అభ్యర్థించినప్పుడు, కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, చెల్లింపు ఆలస్యం అయిందని పేర్కొంటూ నిరాకరించింది.దీంతో కస్టమర్ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







