ఒమన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అజిత్ దోవల్
- June 27, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో అధికారిక పర్యటనకు వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సాంకేతిక, సైనిక, మైనింగ్ రంగాలలో ఆశాజనక రంగాల గురించి సహకారం అంశాలపై ఇద్దరు చర్చించారు. వాణిజ్య, సాంస్కృతిక మరియు పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు సమీక్షించారు.జి 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం తరపున సయ్యద్ బదర్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నారు. నిర్మాణాత్మక చర్చలు, అంతర్జాతీయ సహకారం విధానాలను సమర్థించడంపై తమ రెండు దేశాల నాయకత్వాల ప్రాధాన్యతను వారు నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో జిసిసి, ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ హషీల్ అల్ మస్కారి, ఒమన్ సుల్తానేట్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి అమిత్ నారంజ్, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం