సముద్రపు అడుగుభాగం నుండి టైటాన్ శిథిలాల వెలికితీత
- June 29, 2023
యూఏఈ: సముద్రపు అడుగుభాగం నుండి టైటాన్ శిథిలాలను వెలికితీశారు. గతవారం ఓషన్గేట్ టైటానిక్ యాత్ర సబ్మెర్సిబుల్ విషాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన ఐదుగురు సాహసికులు మరణించారు. కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్లోని సెయింట్ జాన్స్లోని కెనడియన్ కోస్ట్ గార్డ్ పీర్ వద్ద ఉన్న హారిజన్ ఆర్కిటిక్ షిప్ నుండి టైటాన్ సబ్కి చెందిన కొన్ని మాంగల్డ్ శిధిలాలను చేరవేశారు.
కెనడియన్ జెండాతో కూడిన హారిజన్ ఆర్కిటిక్ రిమోట్గా పనిచేసే వాహనం లేదా ROVని తీసుకువెళ్లింది. ఇది న్యూఫౌండ్ల్యాండ్కు దక్షిణంగా 700 కిలోమీటర్లు (435 మైళ్లు) దూరంలో ఉన్న టైటానిక్ శిధిలాల నుండి సముద్రపు అడుగుభాగాన్ని శోధించింది. ROV యజమానులు, US-ఆధారిత పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్, దాని బృందం ఆఫ్షోర్ కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసిందని ధృవీకరించారు. 10 రోజులపాటు పనిచేసిన తర్వాత హారిజోన్ ఆర్కిటిక్ నుండి దాని పరికరాలను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నౌకాశ్రయం శిథిలాలను దించుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టైటాన్ జూన్ 18న సముద్రపు ఉపరితలం నుండి దాదాపు 4కి.మీ (సుమారు 2.4 మైళ్ళు) దిగువన ఉన్న టైటానిక్ సైట్కు వెళ్లే సమయంలో సముద్రపు ఒత్తిడిని తట్టుకోలేక పేలుడు జరిగి అందులో ఉన్న 5 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- విశాఖలో విషాదం..బీచ్లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!
- గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!
- SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!