విదేశీయులతో ఒమానీల వివాహం కోసం దరఖాస్తుల స్వీకరణ
- July 03, 2023
మస్కట్: విదేశీయులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒమానీల వివాహ ధృవీకరణ పత్రాల జారీ కోసం అన్ని దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్టు నోటరీ పబ్లిక్ డిపార్ట్మెంట్ల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ వెల్లడించింది. రాయల్ డిక్రీ నం. 23/2023, సివిల్ ట్రాన్సాక్షన్స్ లా (29/2013) ప్రకారం విదేశీయులతో ఒమానీల వివాహానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, విధివిధానాల ఖరారును నోటరీల విభాగాలు చేపడతాయని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇస్లామిక్ షరియా నిబంధనలకు అనుగుణంగా.. ప్రాముఖ్యత లేదా ప్రత్యేక స్వభావం గల కొన్ని పబ్లిక్ ఫంక్షన్ల కోసం వివాహాన్ని నియంత్రించే సమస్యకు డిక్రీలో సూచించిన నియంత్రణలకు ఇవి అదనమని తెలిపింది. పౌరుల వివాహానికి సంబంధించి ఇతర దేశాల చట్టాలను పాటించడం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించింది. రాయల్ డిక్రీ (23/2023) జారీకి ముందు జరిగిన విదేశీయులతో ఒమానీల వివాహ కేసులు చట్టం నిర్దేశించిన ప్రకారం పరిష్కరించబడతాయని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







