విదేశీయులతో ఒమానీల వివాహం కోసం దరఖాస్తుల స్వీకరణ
- July 03, 2023
మస్కట్: విదేశీయులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒమానీల వివాహ ధృవీకరణ పత్రాల జారీ కోసం అన్ని దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్టు నోటరీ పబ్లిక్ డిపార్ట్మెంట్ల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ వెల్లడించింది. రాయల్ డిక్రీ నం. 23/2023, సివిల్ ట్రాన్సాక్షన్స్ లా (29/2013) ప్రకారం విదేశీయులతో ఒమానీల వివాహానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, విధివిధానాల ఖరారును నోటరీల విభాగాలు చేపడతాయని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇస్లామిక్ షరియా నిబంధనలకు అనుగుణంగా.. ప్రాముఖ్యత లేదా ప్రత్యేక స్వభావం గల కొన్ని పబ్లిక్ ఫంక్షన్ల కోసం వివాహాన్ని నియంత్రించే సమస్యకు డిక్రీలో సూచించిన నియంత్రణలకు ఇవి అదనమని తెలిపింది. పౌరుల వివాహానికి సంబంధించి ఇతర దేశాల చట్టాలను పాటించడం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించింది. రాయల్ డిక్రీ (23/2023) జారీకి ముందు జరిగిన విదేశీయులతో ఒమానీల వివాహ కేసులు చట్టం నిర్దేశించిన ప్రకారం పరిష్కరించబడతాయని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









