7.3 మిలియన్ల మంది ప్రయాణికులతో కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ రికార్డు
- July 10, 2023
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 రెండవ త్రైమాసికంలో 7.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2019లో 7.1 మిలియన్ల మంది ప్రయాణికులు రికార్డును తాజాగా అధిగమించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 80,000 కంటే ఎక్కువగా నమోదైంది. ఈమేరకు రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ కార్యాచరణ పనితీరు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, విమానాల సంఖ్య ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2019 రెండవ త్రైమాసికం(48 వేలు)తో పోలిస్తే విమానాల సంఖ్య 51 వేలకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో 24 దేశీయ గమ్యస్థానాలు, 66 అంతర్జాతీయ గమ్యస్థానాలతో సహా 90 గమ్యస్థానాలకు చేరుకుంది. ఇది 4.6 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. రవాణా, సరుకు రవాణా సేవలను అందించే వాణిజ్య విమానయాన సంస్థలు 2019లో 39 కంపెనీలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 30 శాతం పెరిగి 51 కంపెనీలకు చేరింది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









