7.3 మిలియన్ల మంది ప్రయాణికులతో కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ రికార్డు

- July 10, 2023 , by Maagulf
7.3 మిలియన్ల మంది ప్రయాణికులతో కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ రికార్డు

రియాద్: రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 రెండవ త్రైమాసికంలో 7.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2019లో 7.1 మిలియన్ల మంది ప్రయాణికులు రికార్డును తాజాగా అధిగమించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 80,000 కంటే ఎక్కువగా నమోదైంది. ఈమేరకు రియాద్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ కార్యాచరణ పనితీరు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, విమానాల సంఖ్య ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2019 రెండవ త్రైమాసికం(48 వేలు)తో పోలిస్తే విమానాల సంఖ్య 51 వేలకు చేరుకుంది.  ఈ త్రైమాసికంలో 24 దేశీయ గమ్యస్థానాలు, 66 అంతర్జాతీయ గమ్యస్థానాలతో సహా 90 గమ్యస్థానాలకు చేరుకుంది. ఇది 4.6 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. రవాణా,  సరుకు రవాణా సేవలను అందించే వాణిజ్య విమానయాన సంస్థలు 2019లో 39 కంపెనీలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 30 శాతం పెరిగి 51 కంపెనీలకు చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com