అల్-అహ్సా లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- August 02, 2023
ధమ్మం: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లోని అల్-అహ్సా గవర్నరేట్ ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రతను నమోదైంది. సోమవారం 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకుందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. జూలై 18న 51 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. దాదాపు 13 రోజుల తర్వాత మరోసారి అధిక ఉష్ణోగ్రత రికార్డైంది. దమ్మామ్ నగరంలో సోమవారం 49 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, హఫర్ అల్-బాటిన్ గవర్నరేట్లోని ఖైసుమా, అల్-ఖాసిమ్ ప్రాంతంలోని బురైదాలో 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రియాద్, షరూరా, వాడి అల్-దవాసిర్ మరియు రఫాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా 46- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు తూర్పు ప్రావిన్స్, మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా దుమ్ము తుఫాను చెలరేగే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అదే సమయంలో తూర్పు ప్రావిన్స్లో 48- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే రియాద్ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలలో 46-48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!









