అల్-అహ్సా లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- August 02, 2023
ధమ్మం: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లోని అల్-అహ్సా గవర్నరేట్ ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రతను నమోదైంది. సోమవారం 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకుందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. జూలై 18న 51 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. దాదాపు 13 రోజుల తర్వాత మరోసారి అధిక ఉష్ణోగ్రత రికార్డైంది. దమ్మామ్ నగరంలో సోమవారం 49 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, హఫర్ అల్-బాటిన్ గవర్నరేట్లోని ఖైసుమా, అల్-ఖాసిమ్ ప్రాంతంలోని బురైదాలో 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రియాద్, షరూరా, వాడి అల్-దవాసిర్ మరియు రఫాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా 46- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు తూర్పు ప్రావిన్స్, మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా దుమ్ము తుఫాను చెలరేగే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అదే సమయంలో తూర్పు ప్రావిన్స్లో 48- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే రియాద్ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలలో 46-48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







