దుబాయ్ లో ఆస్పత్రిలో చేరిన భారతీయ నటుడు
- August 02, 2023
దుబాయ్: భారతీయ నటుడు రాకేశ్ బాపట్ హీట్స్ట్రోక్ కారణంగా దుబాయ్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఆయన తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో వేదిక ద్వారా ముచ్చటించాడు. దుబాయ్లో షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాకేష్ ఇటీవల హాస్పిటల్ బెడ్పై నుండి తన చేతిని వీడియో పోస్ట్ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రాకేశ్ చివరిసారిగా మరాఠీ చిత్రం 'సర్సేనాపతి హంబీరావ్'లో కనిపించాడు. 'బిగ్ బాస్ 15', 'బిగ్ బాస్ OTT'లో అతను పాపులర్ నటుడిగా మారాడు. మహిళా నటి షమితా శెట్టితో విడిపోయిన కారణంగా ఈ నటుడు ఇటీవల వార్తల్లో నిలిచాడు. మరోవైపు యూఏఈలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 49°Cకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







