దుబాయ్ లో ఆస్పత్రిలో చేరిన భారతీయ నటుడు

- August 02, 2023 , by Maagulf
దుబాయ్ లో ఆస్పత్రిలో చేరిన భారతీయ నటుడు

దుబాయ్: భారతీయ నటుడు రాకేశ్ బాపట్ హీట్‌స్ట్రోక్ కారణంగా దుబాయ్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఆయన తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో వేదిక ద్వారా ముచ్చటించాడు. దుబాయ్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాకేష్ ఇటీవల హాస్పిటల్ బెడ్‌పై నుండి తన చేతిని వీడియో పోస్ట్ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రాకేశ్ చివరిసారిగా మరాఠీ చిత్రం 'సర్సేనాపతి హంబీరావ్'లో కనిపించాడు. 'బిగ్ బాస్ 15',  'బిగ్ బాస్ OTT'లో అతను పాపులర్ నటుడిగా మారాడు. మహిళా నటి షమితా శెట్టితో విడిపోయిన కారణంగా ఈ నటుడు ఇటీవల వార్తల్లో నిలిచాడు.  మరోవైపు యూఏఈలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 49°Cకు చేరుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com