'ప్రవాసి అంతిమ యాత్ర' - ప్రాజెక్టుకు దాతలు సహకరించండి
- May 16, 2016
విదేశాలలో మరణించిన తెలంగాణ ప్రవాసీల శవాలను స్వదేశానికి తెప్పించుటకు మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ లో ఒక 'హెల్ప్ లైన్' ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.
గల్ఫ్ లోని ఆరుదేశాలలో సుమారు 10 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాసులు సంవత్సరానికి సుమారు 200 మందికి పైగా విదేశాలలో చనిపోతున్నారని ఒక అంచనా. గల్ఫ్ తదితర దేశాల నుండి రెండు రోజులకు ఒకశవం హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు దిగుమతి అవుతున్నది.
శవాలను తెప్పించడానికి కుటుంబ సభ్యులు ఏయే పత్రాలను పంపాలి ? ఇండియన్ ఎంబసీలతో ఎలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి ? అనే విషయాలతోపాటు విదేశాల నుండి హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు శవపేటిక వచ్చినంక వారి స్వగ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచిత అంబులెన్సు సౌకర్యం పొందే విషయంలో మృతుల కుటుంబాలకు ఈ 'హెల్ప్ లైన్' సహాయం చేస్తుంది.
వివరాలకు సంప్రదించండి వాట్సప్ +91 98494 22622

తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









