డెంగ్యూ ఫీవర్తో వచ్చిన నీరసాన్ని తగ్గించుకోవాలంటే.!
- August 04, 2023
సీజనల్ మార్పులో భాగంగా డెంగ్యూ జ్వరాలు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయ్. దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోతాయ్. దాంతో విపరీతమైన నీరసం, హై టెంపరేచర్తో పాటూ, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితి కూడా తలెత్తవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుని చికిత్స ఖచ్చితంగా అవసరం. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే కొన్ని రకాల ఫుడ్ ఛేంజెస్ చేసుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.
డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, పండ్లలో బొప్పాయిని ప్రధానంగా తినాలి. బొప్పాయి పండుతో పాటూ, ఆకుల రసాన్ని కూడా తాగుతుండాలి. పైనాపిల్ పండు కూడా ఈ సమయంలో మంచి శక్తినిస్తుంది. ప్లేట్లెట్స్ పెరగాలంటే, విటమిన్ ఏ,కే,బీ 12, సీ ఎక్కువగా వుండే పండ్లు, కూరగాయలను తినాలి. నారింజ, యాపిల్, బత్తాయి పండ్లలో ఈ విటమిన్లు అధికంగా లభిస్తాయ్.
క్యారెట్, బీట్ రూట్తో పాటూ, గుమ్మడికాయ, చిలగడ దుంపల్ని కూడా తింటే మంచిది. ఉసిరి కాయతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుందని చెబుతున్నారు.
డెంగ్యూ జ్వరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు. నిర్దేశిత సమయంలో వైద్యుని సలహా తీసుకుని, సహజ సిద్ధమైన ఆహారాన్ని టైమ్ టు టైమ్ తీసుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునే అవకాశముంటుది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







