తెలుగులో వారం ఆలస్యంగా 'రాయుడు' సినిమా..
- May 17, 2016
విశాల్, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'మరుదు'. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 'రాయుడు' పేరుతో తెలుగులో విడుదల కానుంది. సాధారణంగా తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విశాల్ వంటి తమిళ హీరోలు తమ సినిమాలను రెండు భాషల్లోను ఒకేసారి విడుదలయ్యేల ప్లాన్ చేసుకుంటారు. అయితే 'మరుదు' తమిళంలో ఈ నెల 20న విడుదలవుతుండగా తెలుగులో 27న 'రాయుడు'గా తెరమీదికి రానున్నాడు విశాల్. దానికి కారణం అదే రోజున మహేశ్ నటించిన 'బ్రహ్మోత్సవం' ఇక్కడ విడుదలవుతుండటమే. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లలో ఉత్సవం చేస్తున్నపుడు విశాల్ వెనక్కి తగ్గడం సరైన నిర్ణయమే. పైగా తర్వాత కూడా 'అఆ' వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే.. విశాల్ నటించిన 'మదగజరాజా' దాదాపు రెండేళ్ళుగా థియేటర్ మొహం చూడటానికి ఆపసోపాలు పడుతోంది. ఎట్టకేలకు అనువాద సినిమాలు ఆక్రమించిన ఈ నెల 13న రావడం ఖాయమనుకున్నా అదీ జరగలేదు. దానిపై విశాల్ మాటేమిటో మరి..!
తాజా వార్తలు
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!









