సౌదీలో చిక్కుకుపోయిన 150మంది తెలంగాణ కార్మికులు
- August 21, 2023
రియాడ్: సౌదీ అరేబియాలో 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారంతా గతేడాదే సౌదీకి ఉద్యోగం కోసం వచ్చారు. కొన్నాళ్ల క్రితం చేస్తున్న ఉద్యోగం కోల్పోవడంతో గత 45 రోజులుగా వారంతా ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. తమ స్వస్థలాలకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని వారు కోరుతున్నారు. సౌదీలో చిక్కుకుపోయిన వారంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట్, కరీంనగర్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లా వాసులు. రియాద్ మునిసిపాలిటీలోని సప్లై డిపార్టుమెంట్ లో జూన్ 2022లో వారు ఉగ్యోగానికి చేరారు. 13 నెలలపాటు ఉద్యోగం చేస్తే.. కేవలం 11నెలల జీతం మాత్రమే అందిందని బాధితులు వాపోయారు. తమను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, టెంట్లలో పెట్టారని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఇఖామా(రెసిడెన్స్ వీసా)ను ఆకస్మికంగా రద్దు చేశారని బాధితుడు దేవారెడ్డి మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!









