సౌదీలో చిక్కుకుపోయిన 150మంది తెలంగాణ కార్మికులు

- August 21, 2023 , by Maagulf
సౌదీలో చిక్కుకుపోయిన 150మంది తెలంగాణ కార్మికులు

రియాడ్: సౌదీ అరేబియాలో 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారంతా గతేడాదే సౌదీకి ఉద్యోగం కోసం వచ్చారు. కొన్నాళ్ల క్రితం చేస్తున్న ఉద్యోగం కోల్పోవడంతో గత 45 రోజులుగా వారంతా ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. తమ స్వస్థలాలకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని వారు కోరుతున్నారు. సౌదీలో చిక్కుకుపోయిన వారంతా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట్, కరీంనగర్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లా వాసులు. రియాద్ మునిసిపాలిటీలోని సప్లై డిపార్టుమెంట్ లో జూన్ 2022లో వారు ఉగ్యోగానికి చేరారు. 13 నెలలపాటు ఉద్యోగం చేస్తే.. కేవలం  11నెలల జీతం మాత్రమే అందిందని బాధితులు వాపోయారు. తమను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, టెంట్లలో పెట్టారని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఇఖామా(రెసిడెన్స్ వీసా)ను ఆకస్మికంగా రద్దు చేశారని బాధితుడు దేవారెడ్డి మీడియాకు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com