త్వరలో భారత్కు ఇజ్రాయెల్ హోటల్..
- May 18, 2016
ఇజ్రాయెల్లోని ప్రముఖ గొలుసు హోటళ్లలో ఒకటైన డాన్ హోటల్స్ త్వరలో భారత్కు రానుంది. బెంగళూరులో తమ తొలి విదేశీ వెంచర్ను ప్రారంభించనున్నట్లు హోటల్ సీఈవో రఫీ సాదే తెలిపారు. 230 గదులతో ఈ హోటల్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరో 10-12 నెలల్లో హోటల్ను ప్రారంభిస్తామని రఫీ తెలిపారు.ఇజ్రాయెల్కి చెందిన అనేక హైటెక్ కంపెనీలు బెంగళూరులో ఉండటంతో.. హోటల్ వ్యాపారం పెరుగుతుందన్నారు. త్వరలోనే భారత్ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పారు. భారత్లో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. దేశ ప్రభుత్వం, స్థానిక అధికారుల నుంచి తమకు అన్నివిధాల సహకారం అందుతోందని.. హోటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించే గిది ఫెడర్మన్ తెలిపారు
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









