‘ఈగల్’ కోసం విదేశాలకు వెళ్లనున్న మాస్ రాజా.!
- August 21, 2023
మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఒప్పుకున్న ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లే.. పూర్తి చేసి వదిలేస్తున్నాడు మాస్ రాజా. అందులో కొన్ని తుస్ అంటున్నాయ్. కొన్ని హిట్ అవుతున్నాయ్.
ఆ సంగతి అటుంచితే, ప్రజెంట్ ఆయన చేతిలో రెండు ప్రాజెక్లులున్నాయ్. రెండూ సైమల్టేనియస్గా షూటింగ్స్ జరుపుకుంటున్నాయ్. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’.
రీసెంట్గా ఈ సినిమా టీజర్ రవితేజ అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే, ఇంకో సినిమా ‘ఈగల్’ కూడా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం లండన్లో షూటింగ్ ప్లాన్ చేశారట. అందుకోసం లండన్కి ప్రయాణం కట్టబోతున్నాడు మాస్ రాజా రవితేజ. ‘ఈగల్’ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ సినిమా రిలీజ్ని సంక్రాంతికి లాక్ చేసి పెట్టాడు రవితేజ.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా