‘ఈగల్’ కోసం విదేశాలకు వెళ్లనున్న మాస్ రాజా.!
- August 21, 2023
మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఒప్పుకున్న ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లే.. పూర్తి చేసి వదిలేస్తున్నాడు మాస్ రాజా. అందులో కొన్ని తుస్ అంటున్నాయ్. కొన్ని హిట్ అవుతున్నాయ్.
ఆ సంగతి అటుంచితే, ప్రజెంట్ ఆయన చేతిలో రెండు ప్రాజెక్లులున్నాయ్. రెండూ సైమల్టేనియస్గా షూటింగ్స్ జరుపుకుంటున్నాయ్. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’.
రీసెంట్గా ఈ సినిమా టీజర్ రవితేజ అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే, ఇంకో సినిమా ‘ఈగల్’ కూడా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం లండన్లో షూటింగ్ ప్లాన్ చేశారట. అందుకోసం లండన్కి ప్రయాణం కట్టబోతున్నాడు మాస్ రాజా రవితేజ. ‘ఈగల్’ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ సినిమా రిలీజ్ని సంక్రాంతికి లాక్ చేసి పెట్టాడు రవితేజ.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







