‘ఈగల్’ కోసం విదేశాలకు వెళ్లనున్న మాస్ రాజా.!
- August 21, 2023
మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఒప్పుకున్న ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లే.. పూర్తి చేసి వదిలేస్తున్నాడు మాస్ రాజా. అందులో కొన్ని తుస్ అంటున్నాయ్. కొన్ని హిట్ అవుతున్నాయ్.
ఆ సంగతి అటుంచితే, ప్రజెంట్ ఆయన చేతిలో రెండు ప్రాజెక్లులున్నాయ్. రెండూ సైమల్టేనియస్గా షూటింగ్స్ జరుపుకుంటున్నాయ్. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’.
రీసెంట్గా ఈ సినిమా టీజర్ రవితేజ అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే, ఇంకో సినిమా ‘ఈగల్’ కూడా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం లండన్లో షూటింగ్ ప్లాన్ చేశారట. అందుకోసం లండన్కి ప్రయాణం కట్టబోతున్నాడు మాస్ రాజా రవితేజ. ‘ఈగల్’ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ సినిమా రిలీజ్ని సంక్రాంతికి లాక్ చేసి పెట్టాడు రవితేజ.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









