‘ఈగల్’ కోసం విదేశాలకు వెళ్లనున్న మాస్ రాజా.!
- August 21, 2023
మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఒప్పుకున్న ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లే.. పూర్తి చేసి వదిలేస్తున్నాడు మాస్ రాజా. అందులో కొన్ని తుస్ అంటున్నాయ్. కొన్ని హిట్ అవుతున్నాయ్.
ఆ సంగతి అటుంచితే, ప్రజెంట్ ఆయన చేతిలో రెండు ప్రాజెక్లులున్నాయ్. రెండూ సైమల్టేనియస్గా షూటింగ్స్ జరుపుకుంటున్నాయ్. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’.
రీసెంట్గా ఈ సినిమా టీజర్ రవితేజ అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే, ఇంకో సినిమా ‘ఈగల్’ కూడా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం లండన్లో షూటింగ్ ప్లాన్ చేశారట. అందుకోసం లండన్కి ప్రయాణం కట్టబోతున్నాడు మాస్ రాజా రవితేజ. ‘ఈగల్’ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ సినిమా రిలీజ్ని సంక్రాంతికి లాక్ చేసి పెట్టాడు రవితేజ.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







