భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి: సిఎం జగన్
- August 23, 2023
అమరావతి: ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా ప్రాజెక్టులకు శంకుస్థాసన చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్రాజెక్టులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు 2,300 మెగావాట్ల సౌర విద్యుత్ కు సంబంధించి రూ.10,300 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లుగా పేర్కొన్నారు. 10,300 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా 2,300 మందికి ఉద్యగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.

తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









