బ్రిక్స్ లోకి సౌదీ అరేబియా, యూఏఈ
- August 25, 2023
జోహన్నెస్బర్గ్: అభివృద్ధి చెందుతున్న దేశాల ‘బ్రిక్స్’ సమూహంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చేరనున్నాయి. వచ్చే ఏడాది ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, అర్జెంటీనా కూడా బ్రిక్స్ లో చేరనున్నాయి.ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా గురువారం జోహన్నెస్బర్గ్లో గ్రూప్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త దేశాల సభ్యత్వం 2024 జనవరి నుండి అమలులోకి వస్తుందని రమాఫోసా చెప్పారు. ప్రస్తుతం ఈ గ్రూపులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా శాశ్వత దేశాలుగా ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ విస్తరణను స్వాగతించారు. కొత్త సభ్యులను చేర్చుకోవడం వల్ల కూటమి బలోపేతం అవుతుందని తమ దేశం ఎప్పటినుంచో విశ్వసిస్తోందని చెప్పారు. బ్రిక్స్ తన మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని 2009లో నలుగురు సభ్యులతో నిర్వహించారు. మరుసటి సంవత్సరం దక్షిణాఫ్రికాను చేర్చుకున్నారు. 2015లో బ్రిక్స్ నూతన అభివృద్ధి బ్యాంకును ప్రారంభించింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









