బ్రిక్స్ లోకి సౌదీ అరేబియా, యూఏఈ
- August 25, 2023
జోహన్నెస్బర్గ్: అభివృద్ధి చెందుతున్న దేశాల ‘బ్రిక్స్’ సమూహంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చేరనున్నాయి. వచ్చే ఏడాది ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, అర్జెంటీనా కూడా బ్రిక్స్ లో చేరనున్నాయి.ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా గురువారం జోహన్నెస్బర్గ్లో గ్రూప్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త దేశాల సభ్యత్వం 2024 జనవరి నుండి అమలులోకి వస్తుందని రమాఫోసా చెప్పారు. ప్రస్తుతం ఈ గ్రూపులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా శాశ్వత దేశాలుగా ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ విస్తరణను స్వాగతించారు. కొత్త సభ్యులను చేర్చుకోవడం వల్ల కూటమి బలోపేతం అవుతుందని తమ దేశం ఎప్పటినుంచో విశ్వసిస్తోందని చెప్పారు. బ్రిక్స్ తన మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని 2009లో నలుగురు సభ్యులతో నిర్వహించారు. మరుసటి సంవత్సరం దక్షిణాఫ్రికాను చేర్చుకున్నారు. 2015లో బ్రిక్స్ నూతన అభివృద్ధి బ్యాంకును ప్రారంభించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







