తెలంగాణలో రానున్న 5 రోజులు వానలు
- September 03, 2023
హైదరాబాద్: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కాగా, వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 5 రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
హైదరాబాద్ లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది.
ఈ రోజు(సెప్టెంబర్ 3) తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరో 5 రోజులు ఉమ్మడి పది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి. వాతావరణం సెకండ్ సమ్మర్ ను తలపించింది. మండుటెండలు ఠారెత్తించాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోయారు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. వాన జాడే లేకుండా పోయింది. దీంతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది.
ఇప్పుడు విస్తారంగా వానలు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో మళ్లీ వానలు పడుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో వానలు పడ్డాయి. ఆ తర్వాత వానల జాడే లేదు. ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. అటు అన్నదాతల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







