‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ని స్పీడ్ అప్ చేసిన రానా.!
- September 05, 2023
అప్పుడుప్పుడో రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్టును ప్రకటించారు ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్. అయితే, ఆ తర్వాత గుణ శేఖర్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయ్. అందులో ‘శాకుంతలం’ కూడా ఒకటి.
రానా కూడా తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే, ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ మాత్రం అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలినట్లు తెలుస్తోంది.
కానీ, చిన్న కిరికిరి. డైరెక్టర్ని మార్చేస్తున్నారట. గుణశేఖర్ ప్లేస్లో మరో డైరెక్టర్ని తీసుకోవాలనుకుంటున్నారట నిర్మాత సురేష్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు త్రివిక్రమ్ చేతికి వచ్చినట్లు ప్రచారం. అయితే, కేవలం స్ర్కిప్టు పనులు మాత్రమే త్రివిక్రమ్ చూసుకుంటున్నారట. డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తేలాల్సి వుంది. ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ని ఈ సినిమా కోసం ఎంచుకునేందుకు చూస్తున్నారట.
త్రివిక్రమ్ సలహాలూ, సూచనలతో ఆ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనీ, త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!