‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ని స్పీడ్ అప్ చేసిన రానా.!
- September 05, 2023
అప్పుడుప్పుడో రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్టును ప్రకటించారు ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్. అయితే, ఆ తర్వాత గుణ శేఖర్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయ్. అందులో ‘శాకుంతలం’ కూడా ఒకటి.
రానా కూడా తర్వాత పలు సినిమాల్లో నటించారు. అయితే, ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ మాత్రం అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలినట్లు తెలుస్తోంది.
కానీ, చిన్న కిరికిరి. డైరెక్టర్ని మార్చేస్తున్నారట. గుణశేఖర్ ప్లేస్లో మరో డైరెక్టర్ని తీసుకోవాలనుకుంటున్నారట నిర్మాత సురేష్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు త్రివిక్రమ్ చేతికి వచ్చినట్లు ప్రచారం. అయితే, కేవలం స్ర్కిప్టు పనులు మాత్రమే త్రివిక్రమ్ చూసుకుంటున్నారట. డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తేలాల్సి వుంది. ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ని ఈ సినిమా కోసం ఎంచుకునేందుకు చూస్తున్నారట.
త్రివిక్రమ్ సలహాలూ, సూచనలతో ఆ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనీ, త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







