హెలికాప్టర్ సముద్రంలో రెండో పైలట్ కూడా మృతి
- September 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్లో గురువారం జరిగిన ఏరోగల్ఫ్ 'బెల్ 212' ఛాపర్ క్రాష్లో రెండవ పైలట్ కూడా మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రెండో పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారని ఏరోగల్ఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. "హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులో ప్రయాణీకులు లేరు. ఇద్దరు సిబ్బంది మరణించినట్లు మేము నిర్ధారించగలము" అని కంపెనీ తెలిపింది. ఏరోగల్ఫ్ ప్రకటన ప్రకారం.. హెలికాప్టర్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆఫ్షోర్ రిగ్ మధ్య సాధారణ శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 7న రాత్రి 8.07 గంటలకు యూఏఈ తీరం దగ్గర సముద్రంలో కూలిపోయింది. ఆ మరుసటి రోజు యూఏఈ జనరల్ ఏవియేషన్ అథారిటీ మొదటి పైలట్ మరణాన్ని ధృవీకరించింది. అయితే రెండవ పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పైలట్లలో ఒకరిది ఈజిప్టు కాగా, మరొకరిది దక్షిణాఫ్రికా అని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







