హెలికాప్టర్ సముద్రంలో రెండో పైలట్ కూడా మృతి
- September 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్లో గురువారం జరిగిన ఏరోగల్ఫ్ 'బెల్ 212' ఛాపర్ క్రాష్లో రెండవ పైలట్ కూడా మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రెండో పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారని ఏరోగల్ఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. "హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులో ప్రయాణీకులు లేరు. ఇద్దరు సిబ్బంది మరణించినట్లు మేము నిర్ధారించగలము" అని కంపెనీ తెలిపింది. ఏరోగల్ఫ్ ప్రకటన ప్రకారం.. హెలికాప్టర్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆఫ్షోర్ రిగ్ మధ్య సాధారణ శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 7న రాత్రి 8.07 గంటలకు యూఏఈ తీరం దగ్గర సముద్రంలో కూలిపోయింది. ఆ మరుసటి రోజు యూఏఈ జనరల్ ఏవియేషన్ అథారిటీ మొదటి పైలట్ మరణాన్ని ధృవీకరించింది. అయితే రెండవ పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పైలట్లలో ఒకరిది ఈజిప్టు కాగా, మరొకరిది దక్షిణాఫ్రికా అని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







