హెలికాప్టర్ సముద్రంలో రెండో పైలట్ కూడా మృతి
- September 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్లో గురువారం జరిగిన ఏరోగల్ఫ్ 'బెల్ 212' ఛాపర్ క్రాష్లో రెండవ పైలట్ కూడా మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రెండో పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారని ఏరోగల్ఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. "హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులో ప్రయాణీకులు లేరు. ఇద్దరు సిబ్బంది మరణించినట్లు మేము నిర్ధారించగలము" అని కంపెనీ తెలిపింది. ఏరోగల్ఫ్ ప్రకటన ప్రకారం.. హెలికాప్టర్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆఫ్షోర్ రిగ్ మధ్య సాధారణ శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 7న రాత్రి 8.07 గంటలకు యూఏఈ తీరం దగ్గర సముద్రంలో కూలిపోయింది. ఆ మరుసటి రోజు యూఏఈ జనరల్ ఏవియేషన్ అథారిటీ మొదటి పైలట్ మరణాన్ని ధృవీకరించింది. అయితే రెండవ పైలెట్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పైలట్లలో ఒకరిది ఈజిప్టు కాగా, మరొకరిది దక్షిణాఫ్రికా అని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







