మొరాకో భూకంప బాధితులను ఆదుకోవడానికి సౌదీ ఎయిర్ బ్రిడ్జి
- September 11, 2023
రియాద్: మొరాకో భూకంప బాధితులకు సహాయక సామాగ్రిని అందించడానికి ఎయిర్ బ్రిడ్జ్ను ఆపరేట్ చేయాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ లు ఆదివారం కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్ఆర్రిలీఫ్)కి ఆదేశాలు జారీ చేశారు. KSR రిలీఫ్ జనరల్ సూపర్వైజర్ డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ మాట్లాడుతూ.. భూకంపంతో ప్రభావితమైన మొరాకో ప్రజల పక్షాన నిలబడాలని, అలాగే దీని ప్రభావాలను తగ్గించడానికి రాజు, క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వినాశకరమైన భూకంపం భారీ మానవ ప్రాణనష్టం, ఆస్తుల నష్టానికి కారణమైందని తెలిపారు. శుక్రవారం రాత్రి మరకేచ్ నగరం సమీపంలో సంభవించిన విపత్తులో 2100 మందికి పైగా మరణించారని, వేలాది మంది గాయపడ్డారని వివరించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుండి సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్, KSR రిలీఫ్ నేతృత్వంలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ నుండి బృందాలు సహాయ చర్య, మానవతా కార్యక్రమాలలో పాల్గొనడానికి.. రక్షించడానికి పంపబడతాయని డాక్టర్ అల్-రబీహ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు మరియు విపత్తులతో బాధపడుతున్న వారికి అండగా నిలవడంలో సౌదీ అరేబియా తనవంతు మానవతా పాత్రను పోషించేందుకు ముందుంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







