కార్మికులను సత్కరించిన దుబాయ్ పోలీసులు
- September 20, 2023
యూఏఈ: దుబాయ్లోని ఒక ఇంధన స్టేషన్లోని కార్మికులను దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇటీవల ఓ వాహనం అగ్ని ప్రమాదంపై వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించినందుకు పోలీసులు ENOC స్టేషన్లోని కార్మికులను సత్కరించారు. దుబాయ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఇంధనం నింపుకోవడానికి టెంపో ట్రక్ గ్యాస్ స్టేషన్లోకి రావడం, ట్రక్ స్టేషన్లోకి వచ్చే క్రమంలో ఎడమ టైరును మంటలు చుట్టుముట్టినట్లు స్పష్టంగా చూపిస్తుంది. ఇది చూసిన స్టేషన్లోని అటెండర్లు మంటలను ఆర్పే యంత్రాలతో తీవ్రంగా కృషి చేయడం కనిపించింది. పోలీసులు ధైర్యవంతులైన ఉద్యోగులను కలుసుకొని వారి ఆలోచనను అభినందించారు. వారి ముందస్తు చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రశంసించారు. లెహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ రషీద్ ముహమ్మద్ సలేం కార్మికులను అభినందించారు. కార్మికులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు. అయితే, అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







