లైసెన్స్ లేని రెస్టారెంట్ లో మద్యం, పంది మాంసం విక్రయాలు
- October 01, 2023
కువైట్: కువైట్ ఒక ప్రైవేట్ నివాసాన్ని లైసెన్స్ లేని రెస్టారెంట్గా నడుపుతున్నందుకు, మద్యంతోపాటు పంది మాంసాన్ని అందిస్తున్నారనే ఆరోపణలపై క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ 8 మందిని అరెస్టు చేసింది. వారు ఒక ప్రైవేట్ నివాసాన్ని రెస్టారెంట్గా మార్చారు. పంది మాంసంతో పాటు దిగుమతి చేసుకున్న మరియు స్థానికంగా తయారు చేసిన ఆల్కహాలిక్ పానీయాలను వినియోగదారులకు అందిస్తున్నారు. అవసరమైన చట్టపరమైన అనుమతి పొందిన తరువాత, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి వారందరినీ అరెస్టు చేసింది. స్థానికంగా తయారైన 489 మద్య పానీయాలు, మద్యంతో కూడిన 54 జార్లు, దిగుమతి చేసుకున్న 10 మద్యం సీసాలు, 218 కిలోల పందిమాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









